నేనేమంత తిండి పోతుని కాదండి , ఏదో ఎవరేజ్ గా తింటాను . కానీ స్వీట్స్ అంటే ఇష్టం . కానీ మా ఇంట్లో మా ఆకరి అత్త చేసే వంటలంటే నాకు చాల ఇష్టం ,నాన్ వెజ్ ఐతే 'ఇరగ తీస్తుంది ',అత్త చేసే స్వీట్స్ తింటే మీరు కూడా ఒప్పేసు కుంటారు . పంచదార అరిసెలు చేసిందనుకో కళ్ళు మూసేసి తినిపించా మనుకో మీరు వెంటనే చెప్పే స్తారు 'కోవా ' అని . అంత బావుంటై , అదే మైసూర్ పాక్ చేస్తే నోట్లో వేసు కుంటే కరిగి పోయి ఎటు పోయిందో మీకే తెలీదు , ఎప్పుడూ ఒకే టేస్ట్ ఎలా వస్తుందబ్బా ? నేను చేస్తే ఒకసారి మెత్తగా కేక్ లా ,మరో సారి గాట్టిగా సుత్తి లా , ఒకో సారి రవ్వ లా పొడి పొడి గా ,ఎందు కు లెండి తన మేన కోడలి నని చెప్పుకుంటే సిగ్గు చేటు . కొత్తి మిర పచ్చడి , బిర్యానీ లు ,నాన్ వెజ్ పచ్చడులు బాగా చేస్తుంది . నేను బిర్యానీ లు మాత్రం బాగా చేస్తాను . ఈమధ్య అరిసెలు తెచ్చు కున్నాము ,' గులహా ఫుడ్స్ ' నుంచి ,ధర గుర్తుకొచ్చి ఏడుపొచ్చింది . బొబ్బట్లు తెస్తే పంచదార తప్ప ఏమి లేదు . నేను ఇప్పుడిప్పుడే ఇంట్లో చేస్తున్నా బాగా వస్తున్నాయి . జామున్స్ ఒకటి ఈమధ్య ప్రతి వాళ్ళు చేస్తున్నారు . నేను మాత్రం జామున్ మిక్స్ వాడను , షుగర్ లెస్ కోవా అంటే పచ్చి కోవా అంటారు కదా అదన్నమాట , దాన్లో కొంచెం మైదా వేసి జామూన్స్ చేస్తే బాగా వస్తాయి .
ఒకసారి అప్పుడే జామూన్ మిక్స్ వస్తోంది , ఆ టైం లో అత్త అయ్యప్ప స్వాములకి ఒక పది మంది కి భోజనాలు పెట్టింది , అప్పుడు నేను కూడా వెళ్ళాను , ఐతే భోజనాలు కాగానే జామున్స్ చిన్న బౌల్ లో సర్వ్ చేస్తే వాళ్ళు 'ఇది ఏమి చెయ్యాలి ' అన్నారు అయో మయం గా , అప్పుడు అత్త అది స్వీట్ అని పాకం తో సహా తీసుకోవాలని చెప్పింది . మావయ్యగారు ఆఫీసు నుంచి వచ్చాక విషయం చెప్పాము , అయన నవ్వుతూ స్వీట్ నోట్లో వేసుకుని పాకం నెత్తికి రాసుకో మని చెప్పక పోయారా అన్నారు సరదాగా .
ఒకసారి ఊరు వెళ్తున్నాం , మా బావగారికి ఫోన్ చేసి '' నాకు జున్ను కావాలి ఎల్లుండి ఉదయానికి అక్కడికి వస్తున్నా , గేదకి డెలివరీ చేస్తారో , సిజె రియన్ చేస్తారో నాకు తెలిదు , జున్ను రెడి చేయండి '' అన్నా
లక్కీగా పాలు దొరికాయట వండించి ఉంచారు , ముక్కలు కోసే లా ఉందది . అబ్బ ... మనసు పాడై పోతుంది .
రుచుల విషయం ఎలాగు వచ్చింది కనుక ఈ సీజన్ లో చెప్పు కో వలసినది ''పొలస చేప '' గురించి ,గోదావరి
వరదలు వచ్చి నపుడు కొత్త నీటి తో పాటు సముద్రం పు ఉప్పు నీటి లో కలుస్తుంది . దానితో ఆ చేపకి మంచి
రుచి వస్తుంది , పులుసు పెడితే అంతే ,బెండకాయ , టమాట వేసి చెయ్యాలి . గోదావరి జిల్లాల్లో ఒక సామెత
ఉంది ''పుస్తెలమ్మి పొలస తినమని '' . అంత పని వద్దు కానీ దొరికితే మాత్రం కొని ,తిని ఎంజాయ్ చెయ్యండి .
ఒకసారి అప్పుడే జామూన్ మిక్స్ వస్తోంది , ఆ టైం లో అత్త అయ్యప్ప స్వాములకి ఒక పది మంది కి భోజనాలు పెట్టింది , అప్పుడు నేను కూడా వెళ్ళాను , ఐతే భోజనాలు కాగానే జామున్స్ చిన్న బౌల్ లో సర్వ్ చేస్తే వాళ్ళు 'ఇది ఏమి చెయ్యాలి ' అన్నారు అయో మయం గా , అప్పుడు అత్త అది స్వీట్ అని పాకం తో సహా తీసుకోవాలని చెప్పింది . మావయ్యగారు ఆఫీసు నుంచి వచ్చాక విషయం చెప్పాము , అయన నవ్వుతూ స్వీట్ నోట్లో వేసుకుని పాకం నెత్తికి రాసుకో మని చెప్పక పోయారా అన్నారు సరదాగా .
ఒకసారి ఊరు వెళ్తున్నాం , మా బావగారికి ఫోన్ చేసి '' నాకు జున్ను కావాలి ఎల్లుండి ఉదయానికి అక్కడికి వస్తున్నా , గేదకి డెలివరీ చేస్తారో , సిజె రియన్ చేస్తారో నాకు తెలిదు , జున్ను రెడి చేయండి '' అన్నా
లక్కీగా పాలు దొరికాయట వండించి ఉంచారు , ముక్కలు కోసే లా ఉందది . అబ్బ ... మనసు పాడై పోతుంది .
రుచుల విషయం ఎలాగు వచ్చింది కనుక ఈ సీజన్ లో చెప్పు కో వలసినది ''పొలస చేప '' గురించి ,గోదావరి
వరదలు వచ్చి నపుడు కొత్త నీటి తో పాటు సముద్రం పు ఉప్పు నీటి లో కలుస్తుంది . దానితో ఆ చేపకి మంచి
రుచి వస్తుంది , పులుసు పెడితే అంతే ,బెండకాయ , టమాట వేసి చెయ్యాలి . గోదావరి జిల్లాల్లో ఒక సామెత
ఉంది ''పుస్తెలమ్మి పొలస తినమని '' . అంత పని వద్దు కానీ దొరికితే మాత్రం కొని ,తిని ఎంజాయ్ చెయ్యండి .
No comments:
Post a Comment