కుర్చీలన్ని గుండ్రంగా తిప్పేసుకుని ,కూచుని కబుర్లు చెప్పుకుంటున్నాము . మండపం దాదాపు ఖాళి ఐంది .
పిల్లలంతా ధర్మకోల్ బాల్స్ తో ఆడుతున్నారు ,ఇంకా కొంతమంది ,పూలన్నీ తీసి విసురుకుంటున్నారు . మా
కుళ్ళు జోకులతో ,నవ్వులతో ,మా చుట్టూ మాత్రమే సందడి గా వుంది . ఇంతలో ఒక వ్యక్తీ నా దగ్గరికి వచ్చాడు .
''అమ్మా నువ్వు ___ చిన్నాన్న గారి అమ్మాయి వే కదా '' అన్నాడు నేను మర్యాద కోసం లేచినిలబడ్డ ను .
''అవునండీ మీరు' ..నసిగెను . '' నేను నీకు అన్నయ్యను అవుతానమ్మా నా పేరు శివ రామ్ ,నిన్ను ఇందాక
నించి చూస్తున్నా ఆకుర్చోడం ,నవ్వడం ,చిన్నాన్నే కన్పిస్తున్నారు ,పోల్చేసాను . అందుకే వచ్చి అడిగేసాను ''.
అన్నాడు . అయన అలా అనగానే ఉబ్బి తబ్బిబ్బు అయ్యాను 'హే ఎస్సేడు 'అనుకున్నా ఇక్కడొక విషయం
చెప్పాలి మీకు , నాకు నన్నెవరన్నా మా నాన్నగారితో పోలిస్తే కర్ణు డిలా కవచకుండలాలు వలిచి ఇచ్చేస్తాను .
అదన్నమాట . ''రా అమ్మా అలా కూచుని మాట్లాడు దాం '' అన్నాడు . మనసులో ఈనతొ నాకు మాటలేమి
వుంటాయి అనుకుంటూ ,మా వాళ్లతో ఇప్పుడే వస్తాను అన్నట్టు చెయ్యి చూపి ఆయన వెంట నడిచాను .
కాస్త దూరం లో వున్నా కుర్చీలలో కూర్చుని, ఎక్కడవుండేది , ఎంతమంది పిల్లలు ,ఆదాయ వ్యయాలు
తాలూకు వివరాలు ,చిన్న ప్రస్నావళి అయ్యాక ''చాల సంతోషం అమ్మా అంత దూరం నించి పెళ్ళికి రావడం
మంచి విషయం '' అన్నారు . నేనూ ఏదో అడగాలి కాబట్టి అడుగుతూ ''మీరెక్కడ వుంటారు పిల్లలెంత మంది ''
అన్నాను . ఆయన ఆశ్చర్యం గా చూసాడు ,మొహం చిన్న బోయింది . ''నీకు తెలీదా నేను పెళ్లి చేసు కోలేదు ''
అన్నాడు . అప్రయత్నం గా ఎందుకు అన్నాను . ఆయన ముఖం వాడిపోయింది .చేతి వేళ్ళు చూసుకుంటూ ..
నీకు ''నాగమల్లి ''తెలుసుగా అన్నారు , నేను సంశ యంగా చూస్తూ ''అవునూ.. నాగామల్లి 'క ?'' అన్నాను ,
అవునమ్మా నీ చిన్నప్పుడు మీ ఇంటి పక్కనుండే దమయంతి గారి మేనకోడలు ,అన్నాడు . అవును
గుర్తుంది మర్చి పోయే రూపమా ఆమెది ,' కాని తను చనిపోయింది కదా ..' అన్నాను . అవును అందుకే
నేను పెళ్లి చేసుకోలేదు ,నువ్వు చిన్నదానివి నీకు గుర్తులేదేమో అనుకుంటున్నాను అన్నాడు .
మాది చాల పెద్ద ఇల్లు ,ఇవతలి వీధికి ఎనిమిది అడుగుల సింహద్వారం టీక్ వుడ్ తో చేసినది వుంది .
పిల్లలు గడియ వెయ్యాలంటే ఇద్దరం వేసేవాళ్ళం , డాబా ఇల్లు ,అవతలి వీధి కి పెంకుటిల్లు వుండేది రెండిళ్ళ మధ్యలో రకరకాల చెట్లు ,మొక్కలు .నీళ్ళ పంపు చుట్టూ గుండ్రటి సిమెంట్ అరుగు వుండేది .
గిన్నెలు కడిగేది ,బట్టలుతికేది అక్కడే . చెట్ల కింద మంచాలు వేసుకుని కుర్చునేవాళ్ళం ,ప్రతి సంక్రాంతి కి
అందరూ వచ్చేవాళ్ళు ,ఒకమంచమన్నా విరగ్గోట్టేవాళ్ళు అంతమంది కుర్చునేవాళ్ళం .
పక్కనే వున్న ఇల్లు దమయంతి గారిది . మా వాళ్లకి స్నేహితులే కాదు బంధువులు కూడా అనుకుంటా ,
వరసలతో పిలుచుకుంటూ ,వస్తూ పోతూ వుండేవారు . ఆ దమయంతిగారి మేనకోడలే 'నాగమల్లిక '.
తరచూ మేనత్త ఇంటికి వచ్చిపోతుండేది ,వాళ్ళది పదిమైళ్ళ దూరం లోవున్న పల్లెటూరు . ఆ అమ్మాయి
ఎంతందంగా ఉండేదంటే ,భగవంతుడు ప్రత్యేకం గా తయారుచేసిన బొమ్మలా వుండేది . అందమే కాదు
అంతకు మించిన ,గుణం కూడా వుంది . వంచిన తల ఎత్తెది కాదు , పలకరించిన వారికి చిరునవ్వే
సమాధానం . ఏంతో నేమ్మదస్తురాలు . అంతకుమించిన సుకుమారమైన హృదయం అని తర్వాత తెలుసు
కున్నాను . అత్తకి సాయం గా బట్టలు ఆరేస్తూ పెరట్లో తిరుగుతుంటే ,ఆమె సోగ కళ్ళని ,పేద్ద .. జడని రెప్ప
వాల్చక చూస్తూ ఈమె రూపమే ఇలావుంది ,జీవితం ఇంకెంత అందం గమలుచు కుంటుందో అనుకునే దాన్ని .
అడిగిన వాళ్ళకి అడగని వాళ్లకి దమయంతి గారు ,మల్లి నా కోడలు అని చెప్పేవారు . ఆ అమ్మాయి ఇది
తన అత్తవారిల్లు అని నిర్నైన్చేసు కుంది మనసులో . దమయంతి గారి అమ్మాయితో కలిసి గుడికి
సినిమాకి వెళ్లి వస్తుండేది . అన్ని అనుకున్నట్లు జరిగితే కదేముంది ? అతగాడికి వుద్యోగం రాగానే తల్లి కి
చెప్పాడు ఎవరినో ప్రేమించానని ,ఆమెనే పెళ్లి చేసుకుంటానని . ఇద్దరు గొడవ పడ్డారు . దమయంతిగారు
మెల్లగా నచ్చ చెబితే వింటా డనుకుని పొరబడ్డారు . కొడుకు కి భర్త సపోర్ట్ చెయ్యడం ఆవిడకి నచ్చలేదు .
మేనకోడల్ని రానివ్వద్దని భర్త చెప్పడం ఆవిడకి బాధకలిగించింది . వీళ్ళిలా తగువులు పడుతుండగా
ఎప్పటిలాగే మల్లి మళ్లీ వచ్చింది . ఆరోజు తల్లి కొడుకు ఆ అమ్మాయి ముందే ఇంగితం మర్చి పోయి
గొడవపడ్డారు ,మల్లిని పంపేయమని అరిచాడు . దమయంతిగారు 'నేను వచ్చి నాన్నతో మాట్లాడతాను ,
ఇక్కడి సంగతులేమి నాన్నకు చెప్పకు ,నువ్వెళ్ళి రా ,' అంటూ ఆమెని పంపేసారు . తను ఊరెళ్ళి పోయింది .
ఆ రాత్రి దమయంతి గారు ఏ డ్చుకుంటూ ,వూరికి వెళ్ళిపోయారు . తర్వాత పెద్దవాళ్ళ మాటల్లో తెలిసింది .
నాగామల్లిక చనిపోయిందని . అంతవరకే నాకు తెలుసు . కాని శివరాం అన్నయ్య నాకు వేరే కోణం చెప్పారు .
ఆయన మాటల్లోనే ..'' మా పెద్దమ్మ కూతురు సుగుణ ,నేను స్వంత అక్క తమ్ముళ్ళ లా వుండేవాళ్ళం మా
పెద్దమ్మ , అమ్మ కూడా వుండేది పక్క పక్కనే కావడం తో ,మరింత కల్సి మెలిసి వుండేవాళ్ళం నా పదేళ్ళ
వయసు లో అక్కకి పెళ్లిజరిగింది . బావగారు కూడా నన్ను బాగా చూసే వారు . తరచు అక్కతో వాళ్ళ అత్తవారి
ఊరికి వెళ్తుండే వాడిని . అప్పుడే బావగారిఅక్కయ్య దమయంతి గారి ఇంటికి వచ్చినపుడు ,మీ నాన్న గారిని
చూసాను ఆయన ఒకసారి చుస్తే మరిచి పోయే వ్యక్తీ కాదు . సుగుణ అక్కయ్యకి ''నాగమల్లి 'పుట్టింది . అక్క
నాతొ ఇది నీ పెళ్ళాం రా అంది . ఎందుకో కాని నాకు చాల నచ్చేసింది మల్లి ,వాళ్ళ వురు వెళ్ళాక నేను
చదువులో పడి పోయాను . సెలవుల్లో వచ్చినపుడు ,మల్లి నేను బాగా ఆడుకునే వాళ్ళం . నేను మల్లి మీద
ఇష్టం పెంచుకుంటున్న సమయం లోనే తను దమయంతి గారి అబ్బాయి ని ఇష్ట పడటం మొదలు పెట్టింది .
నాకు వుద్యోగం రాగానే అక్క బావగారిని పెళ్లి గురించి అడిగింది ,అడిగింది అనేకంటే నేను అడిగించేను అంటే
బావుంటుంది . కాని బావగారు మల్లి ని తన మేనల్లుదికే ఇచ్చి చేస్తాను అని చెప్పే సే రు . అక్క సంబంధాలు
చూస్తాను అని చెప్తున్నా వినకుండా మూడేళ్ళు గడిపేసాను . ఇంతలో దమయంతి గారి అబ్బాయికి వుద్యోగం
వచ్చింది . అక్కబావ దమయంతిగారిని అడిగారు, ఆవిడ మల్లి నా కోడలు అని మాటిచ్చారు . వాళ్ళ అబ్బాయి
ఎవరినో ప్రేమించడం ,ఆసమయానికి అక్కడవున్న మల్లిని తండ్రి, కొడుకు వేల్లిపోమ్మనడం . తిరిగి వస్తూ మల్లి
నిద్రమాత్రలు తెచ్చుకుని వచ్చింది . అప్పుడే వచ్చేసా వేంటి అని అక్క అడుగు తున్నా ,అన్నం తినమన్నా వద్దు
ఎండలో వచ్చాను కదా అందట . ఎంత పిలిచినా పలకదట ,రాత్రికి బావగారు రాగానే తలుపులు తెరచి చుస్తే
ఏముంది నిర్జీవంగా కూతురు . అలా కూతుర్ని చుసిన ఆయన తట్టుకోలేక పోయాడు . ఆమె చేతిలోని వుత్తరం
చదివి ,ఐనవాళ్ళ ద్రోహాన్ని జీర్ణించుకోలేక పోయాడు . భార్యని ఒదార్చవలసిన వాడు పక్కగది లో ఉరితాడుతో
తన దారి తను చూసు కున్నాడు . ఇప్పుడు అక్క నా దగ్గరే ఉంటోంది . ఎన్నోసార్లు పెళ్లి చేసుకోమని అడిగింది .
కాని చనిపోయే ముందు ,నాగామల్లిక రాసిన వుత్తరం చదివాను ''నాకెవరు లేరు నాన్న ,నేను ఒంటరిదాన్ని
అందుకే వెళ్ళిపోతున్నా అని రాసింది . అది నిజం కాదు తనకు నేను వున్నాను ,ఎన్నో ఏళ్ళు ఎదురు చూసాను .
చూస్తాను చూస్తూనే వుంటాను ,నేను జీవితమంతా పెళ్ళిచేసు కోకుండా వుండి పోతేనే తనేక్కడున్నా తనకు
నా ప్రేమ అర్ధం అవుతుంది . అప్పుడే మరో జన్మ లోనన్నా నన్ను కరుణిస్తుంది . తనకు పెళ్లై వుంటే అప్పుడే మర్చిపోయే వాడినేమో ,నాకెవరు లేరంటూ ప్రాణం తీసుకుంది . నేను ఇలా ఒంటరిగా ఉండిపోతే తనకోసం
నేనున్నానని తెలుసుకుంటుంది . అందుకేనమ్మా నేను పెళ్ళిచేసుకోలేదు'' .ఎందుకో తెలీదు రెండు కన్నీటి
చుక్కలు బుగ్గల మీదుగా బరువుగాజారి పడ్డాయి ,రెండుచేతులూ వాటికవే జోడించుకున్నాయి ........
''పురుషులందు పుణ్య పురుషులు వేరయా ... ''
*********************
*********************
బాగుంది
ReplyDeleteమీ సూచనలు పాటిస్తాను ,పెద్దవాళ్ళు చెపితే ఎప్పుడూ తప్పుగా అనుకోను ,ధన్యవాదాలు .
ReplyDelete