కార్తిక మాసం అనగానే ఎవరికైనా గుర్తు వచ్చేది ,పూజలు ,వ్రతాలూ ,దైవ దర్శనాలు ,వనభోజనాలు . నాకు మాత్రం
వనభోజనాలు అనగానే మనసు అడవిలోకి వెళ్ళిపోతుంది . ఎందుకలా ! అంటారా ఇది చదివితే మీకే తెలుస్తుంది .
ఇక్కడ ఎన్నిసార్లు ,ఎంతమంది తో , ఎన్నిచోట్లకు వెళ్ళినా ,నా మనసుకు నచ్చినవి నాకు గుర్తుండి పొఇనవి మేం
అడవిలో వున్నపుడు వేల్లినవే . అవే నాకిష్టం ,ఉదయమే మంచులో ప్రయాణం , ఉదయిస్తున్న సూర్యుడు ,
విచ్చుకుంటున్న పువ్వులు ,వాటిమీద మంచు బిందువులు , పేరుతెలియని పిట్టల కువ కువలు ,గట్టిగా
అరుస్తూ తమ ఉనికి తెలియ చేసే కౌజు పిట్టలు , నిప్పుకోళ్ళు , ఆ కొమ్మకి ఈకొమ్మకి గెంతుతూ గంతులేసే కోతులు ,పూరి విప్పి ఆడుతూ శబ్దాని కి మాయమయ్యే నెమళ్లు ,కుందేళ్ళు , మనసులో చటుక్కున మెదులు
తాడు సృష్టి కర్త , జోహార్లు చెప్పకుండా ఉండలేము .
నెల ముందు నించి అత్యంత ఉత్సాహంగా ప్రణాళిక వేసే వారు ,మానాన్న గారు . తోటి ఉద్యోగులందరి కి ముందే
చెప్పి ఉంచే వారు ఫలానా రోజున వన భోజనాలు అందరూ కుటుంబం తో రావాలని . అప్పటికి తాయారు చెయ్య
వలసిన వంటలు , వెంట తీసు కెల్లా వలసిన జాబితా తయారయ్యేది . బాగా వండే గార్డ్స్ ని ఎంచి ,వాళ్ళతోనే
వందించే వారు . వెళ్ళే చోటు మాత్రం పెద్దగా ఆలోచించ వలసిన పని లేదు . ఎందు కంటే అడివంతా అందాలే !
అందరం కల్సి ఎక్కడికి వెళ్ళినా ఆనందమే , వేరే సరదాలు ఏమి అక్కడ ఉండేవి కాదు కాబట్టి అందరూ ఆ
రోజు కోసం ఎదురు చూసే వాళ్ళు . ఆరోజు ఆడవాళ్ళు ప్రత్యేకం గా తయారయ్యేవాళ్ళు . ఈమె ఆఫీసెర్ భార్య ,
ఆమె గుమస్తా భార్య అనే తేడాలే లేవు ,అంతా కలిసి మెలిసి వుండేవారు . ఒకరి పిల్లలిని ఒకరు దగ్గరికి తీసే
వాళ్ళు . ఒకసారి కాఫీ తోటకు వెళ్తే ,మరోసారి కమలా తోటకి వెళ్ళే వాళ్ళం . ఒకసారి పాములేరు వెళ్తే ,మరో
సారి సాంతం అడవి లోకి తీసుకెళ్ళే వాళ్ళు . అక్కడ ''ఇప్పపూల ''చెట్లు ఉండేవి . అవి మన కిస్ మిస్ మాదిరి
ఉండి పిస్తా పప్పులా తెరచి వుంటుంది . వాటితో సారా కాస్తారట . ఎన్నో ఏళ్ళు నిలవ పెట్టినది మరింత రుచి
ఖరీదు వుంటాయి . వీళ్ళ లో కొంతమంది కొంటేవాళ్ళు వుండేవారు . వాళ్ళు అక్కడికి వెళ్ళడానికే ఇష్టం
చూపించేవారు . మిగతా వాళ్ళని ఒప్పించి అక్కడికే తీస్కేల్లె వాళ్ళు . తాగామన్న సరదాలో వాగే వాళ్ళు
కొందరైతే , వాసనకే పడి పొయ్యేవాళ్ళు మరికొందరు . ఏదేదో వాగేసి భార్యలకు అడ్డంగా దొరికి పొయ్యేవాళ్ళు .

అందరిని తీసుకెళ్ళడానికి జీపు లు సరిపోవు , జీపులు ఒకటి వుండే ను ,రెండు వుండే ను ,మహా ఐతే
పోలిస్ జీప్ కూడా అడిగేవారు ,వాళ్ళు కూడా వచ్చే వాళ్ళు . పోలీస్ వారు , ఫారెస్ట్ వారు ఐకమత్యం గా
వుండేవారు . సిట్టింగ్స్ పెట్టేవాళ్ళు . వాళ్ళంతా కలిసి కూర్చునే సమయం లో తరచూ వాళ్ళు చెప్పుకునే
జోక్ ఒకటి నాకు ఇప్పటికి గుర్తు వుంది . ''ఫారెస్ట్ ఓడిని పెళ్ళికి పోలీసోడిని చావుకి పిలవకూడదు ''.
అని ఒకసామెత అనుకోండి కాని వాళ్ళు విపరీతం గా నవ్వు కొనేవాళ్ళు . పెళ్ళికి పిలిస్తే ఫారెస్ట్ ఓడు
'ఈ పందిరికి కలప ఎక్కడిది ? వంటలకి వంటచెరకు [పుల్లలు ] ఎక్కడివి అంటాడట . పోలీస్ ని
చావుకి పిలిస్తే 'ఎలా చచ్చాడు ? ఎందుకు చచ్చాడు అంటూ ఆరా తీస్తాడట అదీ వాళ్ళ నవ్వుల కారణం .
రెండు లారీ లు శుబ్రం గా కడిగించి ,గడ్డి వత్తుగా వేయించి ,పైన టార్పన్ పరచి కూర్చోడానికి వీలుగా
ఏ ర్పాటు చేసేవారు . ఆడవాళ్ళూ పిల్లలు ఎక్కడానికి రెండు స్టూల్స్ పెట్టేవారు . అవి వెంట తీసు కెళ్ళే
వాళ్ళం అక్కడ దిగాలిగా 1 ఒకసారి రెండో లారి వచ్చేసరికి ఆలస్యమైంది అంతవరకూ మొదటి లారి
లోని వాళ్ళు దిగ దానికి కుదర లేదు . అప్పటినించి ,ఒక్కో లారి కి ఒక జీప్ సహాయం గా వుంటుంది .
భోజనాలు , స్టూల్స్ అన్ని వేరు వేరు గా సర్దించే వారు . మధ్యలో తప్పి పొఇనా ఎవరి కి ఇబ్బంది
లేకుండా ఈ ఏ ర్పాటు . ప్రయాణం లో సరైన బాట వుండేది కాదు , ఎత్తు పల్లాల లో ఊగుతూ
ఉయ్యాల మాదిరి ప్రయాణం సాగేది , నడుములు లారీకి కొట్టుకుని ఆబాధ వుండేది చూడు ...
కాని అదెవరూ లెక్క చేసే వాళ్ళు కాదు . ఆనందో బ్రహ్మ అన్నమాట .
వంటలంటే మా నాన్న గారికి నాన్వెజ్ మాత్రమె . వెజ్ తో ఆయనికి పెద్దగా పరిచయం లేదు . కాని
వెజ్ లో ఆయనికి తెలిసిన వంట ఒకటే ఒకటి . అది బీట్ రూట్ ,కేరట్ చిన్న చిన్న ముక్కలుగా కోసి
పోపులో వేయించి ,కొబ్బరి చల్లేది . అదొక్కటే ఆయనకు తెలిసిన వంటకం .వన భోజనాలకు వెళ్తూ
చేపలపులుసు తీసుకు పోలేముగా ! తప్పనిసరిగా కూరగాయలు వండిస్తూ ,ఆకూర చెయ్యమనే
వారు . అంత మందికి ఆ వేపుడు చెయ్యాలంటే ఎన్ని కిలోలు ,ఎంతసేపు , ఎంతమంది , అంత
చిన్నగా తరగాలి ? కాని ఆయన వినే వారు కాదు ,నలుగురు మనుష్యులని ఎక్కువ పెట్టి మరీ
అదే వేపుడు చేయించేవారు . వనభోజనాలికి సరే నా పెళ్ళికి కూడా అదే కూర చెయ్యాలంటారు .
మా అమ్మ గొడవే సుకుంది , 'థాట్ వీల్లేదు టైమంతా వేస్టు ,వంటవాళ్లు తిట్టుకుంటారు ' అని
ఆయన వినలేదు . మా నవ్వుల మధ్య ,అదే ఖాయం చేసారు . ఇంకా విచిత్రం ఏమిటంటే ఆయనకీ
ఇష్టమైన స్వీట్ సొంపాపిడి [సొంపట్ట ]. వంటవాడిని పిలిచి ,ఇంట్లో చేయించే వారు . అది ఎయిర్ టై ట్
ప్యాక్ లో ఉంటేనే అలా వుంటుంది . బయటికి తీసి తినలేద ను కొండి ,మళ్లీ సెనగ పిండి అవుతుంది .
నన్ను అత్తారింటికి పంపే టప్పుడు సారే కావిళ్ళు అని పెడతారు . ఏ స్వీట్ ఐన రెండు బిందెలచొప్పున
పెడతారన్న మాట , ఈనేమో సొంపాపిడి పెడదామంటారు . మా అమ్మ ఆవూరు వెళ్ళే టప్పు డికి
అదికాస్తా అడుక్కి పోతుంది ,వచ్చిన సారేలో రెండు బిందెలు ఖాళి గా వుంటే చూసి మీ అక్క
మిమ్మలిని పిచ్చి తిట్లు తిడుతుంది అంటే అప్పుడాగేరు .


వెళ్ళిన చోట భోజనాలు చేసే వాళ్ళం . ఐదారు ఐటమ్స్ వున్నందుకో ,మరెందుకో కాదు ,అందర
కల్సి తిన్నందుకు ,వాటి రుచి అమోఘంగా వుండేది . తిన్నాక అలా తిరిగి చూసి వద్దామని అంతా
బయల్దేరే వాళ్ళు ,కాస్త స్త్రీ లమీద శ్రద్ద వున్నా వాళ్ళు తోడుగా వచ్చే వారు ,ఎక్కడ తప్పి పోతారో
అని . మిగతా వాళ్ళు చతుర్ముఖ పారాయణం మొదలు పెట్టే వాళ్ళు . అక్కదేదన్న 'ఏ రు 'వుంటే
మగవాళ్ళని పంపేసి స్నానాలు చేసే వారు . అందులో ఒకామె పేరు గుర్తు లేదు కాని
చాల బాగా ఈత కొట్టేది ,పిల్లలిని పంపమన్న వాళ్ళు కూడా ఆమెని చూసి మమ్మల్ని
కూడా దించేవారు నీళ్ళ లోకి . మధ్యానం స్నాక్స్ ,వేడిగా టీ అక్కడే చేసిచ్చేవారు . వీలయి నన్ని
కమలాలు తిని , కొన్ని వెంటతీసుకుని ,తిరుగు ప్రయాణం అయ్యే వాళ్ళం . శీతాకాలం కాబట్టి
త్వరగా చీకటి పడేది . అదేంటో వెళ్ళేప్పుడు చేసిన అల్లరి , గోల వచ్చేప్పుడు వుండేది కాదు .
అందరూ నిద్రకోరిగే వారు . ప్రతి లారి ముందు జీప్ తో మగవాళ్ళు వెంబడించే వారు . చాల
జాగ్రత్త గా ఇంటికి చేర్చే వాళ్ళు. అందరి మనసులో ఒకటే మెదిలేది మళ్ళీ 'కార్తీకం ''ఎప్పుడని ....
******************************************
Post chaduvutunata sepu mi enjoyment ohinchukuna. Abba naku ila enjoy cheyalani undi.
ReplyDeleteచాలా బాగుంది.
ReplyDeleteముందుగా మీ ఇద్దరికీ స్వాగతం ,మీభావాలు నాతొ పంచుకున్న స్వప్న గారికి ,
ReplyDeleteమా వూరి వారైన కిషోర్ వర్మ గారికి [మీబ్లాగ్ చూస్తున్నా ] ధన్యవాదాలు .