Total Pageviews

Thursday, September 24, 2015

నిమజ్జనం .

వినాయకుని  పండుగకు  వీధి వీధంతా  సందడే , కాలనీలైతే  గాణేషుని  పాటలతో పూజలతో ,మంత్రాలతో  ఎంతో
పవిత్రమైన వాతావ రణం  నెలకొంది . వీలుని బట్టి  మూడు రోజులకు ,లేదా ఐదు రోజులకు  నిమజ్జనాలు జరిగి
పోతున్నాయి . ఆరోజు  వుండే రద్దీ  తట్టుకోవడం  కష్టం కదా ,చాలావరకు  అపార్ట్ మెంట్ లో  ఉంచిన ,వీధుల్లో
ఉంచిన  గణేశు లన్నీ తరలి పోతున్నాయి . నిమజ్జనం  రోజు  టాంక్ బండ్  మీద రద్దీ  ,  ట్రాఫిక్  నిబధనలు
కారణం గా  ఆరోజు వెళ్ళలేక  మూడోరోజు  జరిగే చిన్న చిన్న  గాణేషుల నిమజ్జనం చూడటం  భలే సారదాగా
వుంటుంది . ప్రతి సారీ  నిమజ్జనానికి  ముందు ఏదోఒక రోజు   అలా  ఒకరౌండ్  కొట్టి రావడం అలవాటు కనుక
ఈసారి కూడా  వెళ్ళాము .







ముందుగా  ''ఖైరతాబాద్  గణపతిని '' దర్శించుకుని , అక్కడ నించి నెక్లెస్ రోడ్ ,టాంక్ బండ్ మీదుగా తిరుగుతూ
ఫోటోలు తీసుకుంటూ , గణ పతికి  వీడ్కోలు  చెప్పాము . బూరలు  వుడుకుంటూ  నుదిటికి రిబ్బన్ కట్టుకుని
చిన్నపిల్లలు  నుండి  పెద్దవాళ్ళవరకు  ఎవరికీ తోచిన వాహనాల్లో వాళ్ళు ,  వాళ్ళవాళ్ళ గణపతులు తెచ్చి
నిమజ్జనం చేస్తున్నారు ,ప్రసాదాలు పంచుతున్నారు . ఎక్కువగా ఆడవాళ్ళు వుండడం  ఒకవిశేషం .









అసలు పండుగ విశేషం ,విధానం గురించి వింటే ఆశ్చర్యం వేస్తుంది . కేవలం  చెరువు దగ్గర దొరికే  మట్టి మాత్రం
తెచ్చి  వినాయకుణ్ణి  చేయ్యాలట . అదికూడా  ముందురోజు , విగ్రహం ఆరాలి కదా మరి ! తర్వాతి రోజు పొద్దున్నే
లేచి స్నానాదికాలు  కానిచ్చి ,పత్రికోసం వెళ్ళా లట , ఇరవై ఒక్క రకాల ఆకులు వాటి కాయలు తేవడంతో పాటు
ఆయా చెట్ల  నించి వచ్చే గాలులు , ఔషద గుణాలు ,మన లోపల వుండే చిన్ని చిన్ని రుగ్మతలు నయం చేస్తాయి.
మూడురోజులు  పత్రిపుష్పాలతో  పూజించడం వల్లవాటి  పేర్లు తెలిసే అవకాశం వుంది . ఈపండుగ  పేరు చెప్పి
చిన్న చిన్నమనస్ఫర్దలు ,బందువులతో కాని ఇరుగు పొరుగు వారితో కాని   వుంటే తొలగిపోయి ఐక్యం గా
ఉంటాము  . ఇంతే కాదు  విగ్రహాన్ని, దానితోపాటు ప్రత్తిని  చెరువు లో  నిమజ్జనం  చెయ్యడం వల్ల నీళ్ళలోని
కాలుష్యం కూడా కూడా కరిగిపోతుంది . పూర్వం  చెరువు నీళ్ళేగా అన్నిటికి ఆధారం . ఆవిధంగా ఈపండుగతో
ఎన్నో ఉపయోగాలు పొందేవారు .అలాంటి పండుగ కాస్తా  కాల క్రమేణా  మార్పులు చెందుతూ ,ప్లాస్టర్ ఆఫ్ పారిస్  విగ్రహాలు ,మార్కెట్లోని గడ్డి గా మారింది ,  విగ్రహాలు వాటికి వేసే రంగుల వల్ల కూడా ఊపిరి తిత్తుల
వ్యాధులు ,కిడ్ని సమస్యలు ,నిమజ్జనం వల్ల  విషతుల్యం అవుతున్న చెరువులు ?! . చదువుకున్న వాళ్ళు
ఎక్కువమంది  ఉన్న ప్రస్తుత కాలం కన్నా పాతవాళ్ళకే  పర్యావరణం గురించి ఎక్కువ తెలుసన్నమాట ?!!!!!.


  1.                    *****************************************

No comments:

Post a Comment