Total Pageviews

Thursday, September 3, 2015

పేరంటం





పేరంటం  లో  పాటించవలసినవి  కొన్ని పద్దతులు ఉంటాయని  నేను  అనుకుంటున్నాను . పూజలు ,వ్రతాలూ
లాంటివి  నాకుచాలా ఇష్టం . చక్కగా ఆచరిస్తుంటాను . ఆ అనుభవం తో కొన్ని విషయాలు  ప్రస్తావించవచ్చు
అనుకుంటున్నాను . ముఖ్యం గా ఇలాంటివి వ్రతాలు చేస్తున్నపుడు ముందురోజే అందరిని   పిలుచు కోవడం మంచిది . అంతేకాదు ఇంటి పనులు కూడా ముందురోజు ముగించి  , విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం .
పూజ  ముగిసిన తర్వాత ,మధ్యానమే వచ్చిన  వారికి  ఇవ్వ వలసిన తాంబూలం [పసుపు బొట్టు ]సిద్దం
చేసుకోవాలి   అంతే కాని వచ్చిన వాళ్ళని  కూర్చో బెట్టి ,ఆ గదిలో  తమల పాకులు  ఈ గదిలో వక్కపొడి ,
పసుపు కుంకుమ  పేకేట్స్ ,అంటూ తిరుగుతూ  వచ్చిన వాళ్ళ సమయం వృధా  చేయడం సరికాదు ,ముందే
అన్నీ సిద్దం చేసి పెట్టుకోవాలి . అన్నీ సిద్దం గా వుంటే  చక చకా  అందించేయొచ్చు . పేరంటం అనేది కేవలం
వాయనాలు ఇచ్చి పుచ్చు కోవడాని కే తప్ప , వేరేఅనవసర  విషయాలు చెప్పుకునే సందర్భం కాదని గుర్తించాలి .
వాళ్ళూ  కొంతమంది ని  పిలుచుకొని వుంటారు . త్వరగా వెళ్ళవలసి వుంటుంది . లేదా మనం  కొందరిని పిలిచిన
విషయం మర్చి పోయి , వేరే వాళ్ళ ఇంటికి వెళ్లి  అక్కడే కబుర్లాడుతూ  కూచోడం సరికాదు . ఇంటికి వచ్చిన వాళ్ళు , ఎంతసేపు ఎదురు చూస్తుంటారు ?  ''నేను వేరే వాళ్ళ ఇంట్లో వున్నానండి టైం పడుతుంది  మా అమ్మాయి ఇస్తుంది ,
లేదా పనమ్మాయి  ఇస్తుంది , అని సెల్ పోన్ లో చెప్పడం మర్యాద కాదు . అంతగా తరగని కబుర్లు వుంటే తీరికగా
మరోసారి వెళ్ళాలి . కొంత మంది సమయం చెప్పరు , ఉదయమా , సాయంత్రమా , అన్నది వివరంగా  చెప్పాలి .


పిలవాడనికని  ఒకరింటికి వెళ్తే ,వాచిన కళ్ళతో లేచివచ్చింది . ఏమైంది  అంటే  వ్రతం చేసుకోవడానికి  భర్త
బంగారం కొనివ్వలేదట . చేసేదే  వాళ్లక్షేమం కోసం . కొనివ్వకుండా ఉంటారా ! భార్య నగలేసుకుని  పక్కన
నించుంటే వాళ్ళకే గా  గౌరవం ? అలాంటప్పుడు ఏమాత్రం వీలు కుదిరినా  కొనిస్తారు . దానికోసం ఏడ్వాల్సిన
పనిలేదు .   సంతోషం గా భర్త ఆరోగ్యం , సౌభాగ్యం  కోసం చేసే పూజ ఇది . ఎవరిని పీడించకుండా ,ఉన్న దాంట్లో తృప్తిగాచేసుకుంటే చాలు . చెయ్యకపోయినా ఫర్వాలేదు కాని ,శ్రావణ శుక్రవారం  మంచానికి అడ్డం పడి
 ఏడవకుండావుంటే చాలు , మగవాళ్లకి అదే పదివేలు .




కావలసిన  వాటికంటే ఐదు  ఆరు  వాయనాలు  ఎక్కువే తాయారు చేసుకోవాలి . పిలవకున్నా పక్కవారి తో
వచ్చే వాళ్ళుంటారు . కాదనకుండా  సంతోషం గా  ఇచ్చే అలవాటు చేసుకోవాలి . ఇవన్నీ ఎవరికీ తెలియనివి
 కాదు కాని ,  మరోసారి  మాట్లాడుకోవడం  లో తప్పు లేదుగా ! పైగా కొత్తగా చేసే వారికి ఉపయోగం .పూర్వం
 నోము నోచుకుని  వాయనాలు ఒక బుట్టలో సర్దుకుని  సాయంత్ర ఇంటికి వెళ్లి మరీ ఇచ్చి వచ్చే వారట,  అదీ
వారి శాఖ లోనే  అయ్యి వుండాలి ,నోము తీర్చుకున్న వాళ్ళు అయి వుండాలి . అంటే పెళ్ళైన కొత్తలోనే
నోము పట్టి ఐదు సంత్సరాలు ఏ ఆటంకము లేకుండా తీర్చుకున్న వాళ్లకు ఇవ్వాలట అలాంటి వారికోసం
వెదికి  మరీ ఇచ్చి వచ్చే వారు . ఇప్పుడు ప్రేమ వివాహాల పుణ్యమా అని  లోకమంతా వసుధైక కుటుంబం
అయింది . ఇక  నోములకి , వాయనాలకి  ఓపిక  తీరిక ఎవరికీ  లేదు . గట్టిగా అడిగితె ఆరోజుల్లో  స్త్రీలకి
ఇదే కాలక్షేపం  కనుక '' కమ్యునికేషన్ ''కోసం  చేసేవారు అంటున్నారు . ఇప్పటి వారికి ఆ అవసరం లేదట ?!

                                        *****************************

No comments:

Post a Comment