Total Pageviews

Thursday, May 21, 2015

మన చిట్కాలు -2

మొదట  మనం  అందానికి  చిట్కాలు  చెప్పుకున్నాము . ఇప్పుడు  ఆరోగ్యానికి . ఇవన్ని  మా ఇంట్లో మా
పెద్దవాళ్ళు పాటించినవి .   ఇవన్నీ  నేను పాటిస్తుంటాను .పిల్లలికి  ఎక్కువ మందులు వాడే  పని లేకుండా ఉపయోగ  పడుతుంటాయి .


1]  దగ్గు  ఆయాసం  వున్నవాళ్ళు ,కాస్త  చల్లబడగానే  ఊపిరి తీసుకోవడం  కష్టమవుతుంది . అలాంటప్పుడు  కాస్త
వాము  వేయించి , ఒకగుడ్డ లో  మూటకట్టి ,ఛాతి  మీద వీపు  మీద  కాపడం  చేయాలి . త్వరగా  ఫలితం వుంటుంది

2]  ఒకోసారి  తిన్న  తిండివల్లనో ,బయట  బండిమీద తినడం  వల్ల  కూడా  కడుపులో  నొప్పిలా  అన్పిస్తుంది . అప్పుడు  కొంచెం నునె లో  కొంచెం  వాము ఒక  ఎండుమిర్చి , కరివేపాకు   వేయించి వేడి వేడి  అన్నం లో
కలిపి కొద్దిగా  ఉప్పు చేర్చి తినాలి . కడుపునొప్పి  హుష్ కాకి  అయిపోతుంది .

3]  ఎప్పుడూ చేసుకునే  చారు  విసుగు పుడుతోందా .. ఐతే రెండు  బెండకాయల తో పాటు  చిన్న  బెల్లం ముక్క
వేసి  మరిగించండి , పోపులో  వాము  వేసి  తాలింపు పెట్టండి .

4]  ముఖ్యం  గా  గుర్తు పెట్టుకో  వలసిన  విషయం  వాము త్వరగా  మాడుతుంది ,కాబట్టి చిన్న  మంట మీద
చేసుకోవాలి .

5]  ఎప్పుడన్నా  వాము ఆకు దొరికితే ,బజ్జీ  వేసుకోవడం మర్చి పోకండి . రుచికి రుచి ,ఆరోగ్యానికి ఆరోగ్యం .


6]  సెనగపిండి  పడని  వాళ్ళు చాలామందే  వుంటారు . అలాగే పప్పులు  కూడా  అలాంటి వాళ్ళు , సొంటి పొడి
దొరుకుతుందిదానితో  ధనియాలు ,జీలకర్ర   పొడిచేసుకుని ,అన్నంలో  మొదటిముద్దలో  నెయ్యి  వేసుకుని తినాలి .
       





7]  కడుపులో  కాస్త మండగానే  మందులు గుప్పించేయ్యకండి  ఎర్రని పళ్ళు పరకడుపున  తినాలి . స్ట్రాబెర్రీ ,చెర్రీ
లేదా టమాట పళ్ళను రెండు తీసుకుని  ముక్కలుగా కోసి ,కాస్త పంచదార చల్లి  తిన్నా మంటతగ్గుతుంది . వారం
లో  రెండుసార్లన్నా తీసుకుంటే  త్వరగా  ఫలితం వుంటుంది .


8]  ప్రొద్దుటే తలతిరిగే  బాధ  ముఖ్యం గా  ఆడ వాళ్ళ లో  ఎక్కువగా వుంటుంది . పుట్నాలు [వేయించిన శెనగ
పప్పు ]  పొడి చేసుకుని బెల్లంతో ,కలిపి తినాలి . లేదా పాలుకలుపుకుని  కూడా తినచ్చు .


9]  ఆడపిల్లలికి తరచూ  నువ్వులు బెల్లం  కలిపి చేసే  నువ్వులుండలు  పెడుతుండాలి .




10]   కప్పు నువ్వులు, స్పూను  జీలకర్ర , ఎండుమిర్చి ,వలిచిన  వెల్లుల్లి  కలిపి  వేయించి ,పొడికొట్టి  రొజూ  మొదటి ముద్దలోతినాలి . దీనివల్ల  కాల్షియం  లభిస్తుంది .




11]  వీలైనంత  వరకు  ఖర్జూరం  ఎక్కువ తింటే  మంచిది .




12] నెలకి ఒకసారన్నా  పొద్దున్న ఖాలీ కడుపుతో  దనియాలు  రసం తీసి పుచ్చుకోవాలి  కఫం తగ్గుతుంది .



13] పెద్దవాళ్ళకి  కాళ్ళు  నొ ప్పులుగా వున్నప్పుడు ,రాళ్ళ ఉప్పు ను,  వేడిచేసిన  నీళ్ళలో వేసి ,వేడి సరి చూసి
కాళ్ళు ఉంచమని  చెప్పాలి , నొప్పులు తగ్గుతాయి .





14]  దాల్చిన చెక్క  పొడి చేసుకుని ,టీ  కాచేటప్పుడు  చిటికెడు వేసుకుంటే ,కీళ్ళ నొప్పులు  తగ్గుతాయి .




15]  కాస్త నూనె లో  వలిచిన  వెల్లుల్లి  నాలుగు , రెండు  చిదిమిన  ఎండు మిర్చి  వేసి వేయించి ,మెత్తగా
 నూరిన  గసగసాలు ముద్ద  వేసి  కురలా  చెయ్యాలి . ఇది వేడి అన్నం తో తింటే , జిగట విరోచనాలు
  అదే రోజు తగ్గిపోతాయి .


16]  ఒక  గుప్పెడు గోధుమలు  ఒక రోజంతా ,నీళ్ళ లో  నానించి ,వాటిని  ఒక తొట్టిలో మొలకేత్తించాలి  ఆ గడ్డి
  కట్ చేసి , గ్రైండ్  చేసి వడపోసి ,నిమ్మచెక్క పిండి ,కాస్త తేనే కలిపిఉదయమే  పుచ్చుకొండి ఆ రోగ్యంకోసం .



17]  రోజు మొత్తం లో  ఒక పది నిముషాలన్నా వ్యాయామం  మంచిది . ప్రొద్దుటే చెయ్యడం  వీలు కాక పొతే
  తిన్న తర్వాత  నాలుగు గంటల విరామం  ఇచ్చి వ్యాయామం  చేస్తే మంచిది . అవి కూడా  యోగా సనాలు
   శరీరాన్ని  భాదించ కుండా  నిదానం గా  చేసుకుంటూ  వెళ్ళడం  ముఖ్యం . ఇప్పటికే   వచ్చి వుంటే
  సరే లేక పొతే ,టి వి   లో చూసి కాకుండా ఎవరన్నా  నిపుణుల దగ్గర నేర్చుకుని  కనీసం రోజుకు  పది
    ఆ సనాలు  వెయ్యగలిగే  ప్రయత్నం చెయ్యాలి .
 .

                                 ***********************************************

2 comments: