Total Pageviews

Thursday, March 22, 2018

సమ్మర్ ట్రిప్


వివరాలు చివర్లో ............................................

                      

                     


                       

                       

                          


                           

                                       


                                        

                            

                            

                          

                                           

                        

                         


                        

                       

                               

                        

                        



                       


                         

                            

                             



                             


బెంగుళూర్ ,వెళ్లి ముందుగా చూసింది ఇస్కాన్ టెంపుల్ , తర్వాత  విస్వేస్వరయ్య మ్యూజియం చూసాం .
టిప్పుసుల్తాన్ ప్యాలస్ ,లాల్ బాగ్ బొటానికల్ గార్డెన్ ,చూసి రెండురోజుల తర్వాత  మైసూర్ వెళ్ళాము
మైసూర్ లో కూడా గార్డెన్ ,ప్యాలస్  చూసేము . చాముండేశ్వరి టెంపుల్  చూసి ,దగ్గరలో డ్యామ్ చూసి
షాపింగ్ చేసి ,మైసూర్ నించి  బయల్దేరి ఫారెస్ట్ మీదుగా ఊటీ చేరాము . దారిలో కేరళ ,తమిళనాడు
కర్ణాటక గవెర్నమెంట్  సరిహద్దు బోర్డులు ఉండడం తమాషాగా  అన్పించింది .చాలా జంతువులూ
కన్పించాయి . మైసూర్ ,బెంగళూర్ లో మాకు జూ కి వెళ్ళడానికి కుదరలేదు . కానీ చాలాబావుంటాయిట .
నేను ఈ రెండు ఊర్లు గురించి త్వరగా ముగించింది ఎందుకంటే ,ఊటీ చాలా నచ్చేసింది ,ఎంత బావుందో
చిటపట చినుకులు వాతావరణం ,మబ్బులైతే తెల్లని హంసల్లా కొండల పై వాలుతూ చెయ్యి చాపి అందుకోవాలన్పించేలా  చాలా దగ్గరగా ,రోజ్ గార్డెన్ , చాల రకాల పువ్వులు  విరిసినవి విరిసినట్టే
వున్నాయి అందంగా , ఎందుకంటే  చల్లని వాతావరణం కదా ఫ్రిజ్ లో పెట్టినట్లే అన్నమాట . బోట్ షికారు,
అసలు మనకు కొత్తగా వెళ్లమనే ఆలోచనే రాదు ,ఎందుకంటే ఎన్నో సినిమాల్లో చూసే ఉంటాము కనుక .

అసలు అక్కడ హోటల్ రూమ్స్ లో  ఫైర్ ప్లేస్ అన్నా ఉందికాని ,ఫ్యాన్ కోసం హుక్ కూడా లేదు . ఉదయం
తొమ్మిది కి కానీ తెల్లవారడం లేదు ,డ్రైవర్ కూడా చెప్పేస్తున్నాడు తొమ్మిదికి వెళ్లాలని . చాకోలెట్స్ ట్రే లో
పెట్టి స్వీట్స్ మాదిరిగా అమ్మేస్తున్నారు ,ఫ్రిజ్ అవసరం లేదు కదా ! టీపొడి  తయారు చేసే ఫ్యాక్టరీ వుంది .
గ్రీన్ టీ తో సహా చాల ఫ్లేవర్లు దొరుకుతున్నాయి ,  మసాలాలు ఐతే ఫ్రెష్ చవకకూడా ,అన్నీ తీసుకున్నాము .
ఇంకా స్వెట్టర్లు ,హ్యాండ్ బాగ్స్ తీసుకున్నా ,బహుశా చెన్నై నించి వస్తాయనుకుంటా ,కాళ్ళ నొప్పులకోసం
నీలగిరి తైలం కూడాకొన్నాను .హైద్రాబాద్  మండే ఎండల నుండి ఊటీ కి  వెళ్లి అక్కడ స్వెట్టర్ కొనుక్కోవడం
నాకు  మర్చి పోలేని  ఒక అనుభూతి .

దొడ్డబెట్ట వెళ్ళినప్పుడైతే త్రిల్లై పోతాము ఆఘాట్ రోడ్ లో  వర్షం లో అంతపైకి ,అన్ని వేల కిలోమీటర్ల ఎత్తుకి
వెళ్తుంటే హబ్బా .. నేను వర్ణించ లేను  ఆ ప్రయాణం లోని అనుభూతి  ఒకసారన్నా అనుభవించి తీరవలసిందే
కింద లోయలోకి చూస్తుంటే .. కోయంబత్తూర్ కన్పిస్తుందన్నారు ,కానీ బాగా మబ్బులు ఉండడం తో కన్పించలేదు
దొడ్డబెట్ట లో  ఆ రైలింగ్ అలాగే ఉంటుందని  కమల హాసన్ ,జయప్రద  డాన్స్ చేసిన చోట ఫొటోస్ తీసుకోవాలని
అనుకున్నాను . చాలా మార్పులు చేసారు దాంతో నాకు నిరాశ తప్పలేదు .

ఊటీ నించి కూనూర్  వెళ్ళాము ,అక్కడినించి  ఊటీకి ట్రైన్ లో వచ్చాము చాలా నచ్చేసింది ,నాకెందుకో
అరకు ట్రైన్ జర్నీ గుర్తుకువచ్చింది (ప్రాంతీయ అభిమానం ) ట్రైన్లో అక్కడే వుండే ఒకాయన పరిచయం
అయ్యారు ,ఆయన చెప్పిన ప్రకారం బాలీవుడ్ నటి నూర్జహాన్ అనే నటికీ కొన్ని వేల ఎకరాలు వున్నాయట
ఆమె లేరు కానీ వారసులు అవన్నీ చూసుకుంటున్నారని  చెప్పారు . తమిళనాడు ముఖ్యమంత్రి ,నటి
జయలలితకు 900 ఎకరాలు  టీ తోటలు  వున్నాయట ,కానీ ఆమె మరణించాక  వాటికి ఆమె డబ్బు
చెల్లించలేదని , టీ తోట స్వంత దారులు కోర్ట్ కి వెళ్లారని చెప్పారు . కొండల మీదికి వెళ్లే కొద్దీ భవంతులు ,
టీ తోటలు  ఆ నిర్మాణానికి నిజంగా హేట్సాఫ్ .......

ఊటీ లో సైనిక్ స్కూల్ ఉందని తెలిసి ఆశ్చర్యమేసింది , ఒక ఏడాది కి 220 మంది ట్రైనింగ్ పూర్తి చేసి బోర్డర్ కి
వెళ్తారట  . ఆఫీసర్స్ ఐతే 20 మంది వస్తారట ,వాళ్ళకి క్లాసులు చెప్పటానికి . వారి అవసరాలకోసం హెలిపాడ్
కూడా ఉందట . బొటానికల్ గార్డెన్  లో ఫొటోస్ వీడియోస్  తీసుకున్నాము . మొత్తం తిరిగి చూసే ఓపిక
అయిపోయింది . ఈసారి తిన్నగా ఊటీ వెళ్లిపోవాలని  నిర్ణయించు కుని ,ఎన్నో ఆనందాల్ని అనుభూతుల్ని
మనసులో నింపుకుని  తిరుగు ప్రయాణం అయ్యాము .

********************************************************************************

2 comments: