ఆరోగ్యం గా , అందం గా వుండాలని ,ఎవరికీ వుండదు చెప్పండి ? కొంతమందికి ఎంతవయసు వచ్చినా అసలు
తెలియనే తెలియరు . మరికొంతమంది చిన్నవయసు లోనే ముదురుల్లా అన్పిస్తారు . మనజీన్స్ ఎలాంటివైనా
కొన్ని జాగ్రత్తలతో , అందాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు . మన ఆడవాళ్లకు జుట్టు అంటే ఎంత ప్రేమో ,
1 పెరుగులో మెంతి పిండి వేసి రాత్రంతా వుంచి తలకు పెట్టేది .
ఇది జుట్టు మెత్తగా అవడానికి పనికి వస్తుంది .
2 గోరింటాకు తలకు పెట్టె వాళ్ళు ,టీ డికాషన్ లో కలపకూడదు .
పెరుగులో మాత్రం కలపాలి . రాత్రి కలిపి వుంచి పొద్దున తలకు
పెట్టుకుని నీళ్ళతో మాత్రమే కడగాలి .'' తర్వాత రోజు ,కొబ్బరి నూనె
రాసి ఒకగంట ఆగి షాంపూ చెయ్యాలి'' . తలలో చుండ్రు ఉన్నట్లయితే
బీట్ రూట్ రసం తో గోరింటాకు కలిపితే ,చుండ్రు వదిలి పోతుంది . రంగు
వద్దు కేవలం మెత్తదనం కోసం అనుకుంటే ,కొబ్బరి నూనె రాసి ,గోరింట
ఆకు పెట్టుకోవాలి .
3 కలిపే విధానం తెలుసు గా ,ఒక కప్ గోరింట పొడి ,గుంటగల గరాకు పొడి ఒకస్పూన్ ,ఉసిరి పొడి
సగం స్పూన్ , నాలుగు చుక్కల యూక్ లిప్ట స్ ఆయిల్ , నాలుగు చుక్కల నిమ్మరసం ,నీళ్ళతో
కలిపి రెండు స్పూన్ల పెరుగు వెయ్యాలి , లేదా పైన చెప్పినట్లు బీట్ రూట్ రసం తో మొత్తం
కలుపుకోవచ్చు .వాసన నచ్చకపోతే జుట్టు కడిగేటప్పుడు నిమ్మచేక్క పిండి న నీళ్లు పోసుకోవాలి .
4 మొహానికి , తురిమిన ఆలుగడ్డ [బంగాళదుంప] లో నిమ్మరసం వేసి మొహమంతా మృదువు గా
రాయాలి . మిగిలిన మిశ్రమం కళ్ళ మీదవుంచి పా వుగంట తర్వాత చల్లని నీళ్ళతో కడగాలి .
మీరిక కెమికల్ బ్లీచ్ వాడే అవసరం రాదు .
మచ్చలు ముడతలతో పాటు ,చెడు అలవాట్ల వల్ల కళ్ళకింద వచ్చిన ముడతలు పోతాయి .
అన్నట్లు వట్టినిమ్మచేక్కరాసినా బ్లీచ్ అవుతుంది కాని ఎండలోకి వెళ్ళకూడదు మొహం
నల్లబడుతుంది .
5 '' టమాట మధ్యకి కట్ చేసి ,రెండుచేతుల పట్టుకుని చెంపల మీద పైకి తిప్పుతూ మొహం
అంతా రాయాలి ,20 నిముషాలు ఆగి కడిగేస్తే ఎండవల్ల వచ్చిన ''టాన్ '' పోతుంది . స్కిన్
లో కూడా చాల మార్పు గమనించవచ్చు వారానికి రెండుసార్లు చేస్తే చాలు ''.
6 మగవాళ్ళకి ఎండలో తిరగడం వల్ల వచ్చే నల్లని మచ్చలు వలయాలు ,పోవాలంటే ,అలోవేర
[కలబంద ] గుజ్జులో నిమ్మ రసం నాలుగు చుక్కలు వేసి మచ్చలమీద రాసి ఆరాక కడిగేయాలి .
'' ఏన్ని మందులు వాడినా తగ్గని మచ్చలు ,ఇలా వారానికి నాలుగు సార్లు చేస్తే పోతాయి'' .
7 మీది పొడి చర్మమా , తేనే రాసి చుడండి , కాస్త బొంబాయి రవ్వలో తేనే నీరు వేసి ముద్దలా
చేసి మోహము మెడ రాసి కాస్తాగి కడగాలి మృదువైన చర్మం మీసొంతం .అలాగే పొడిచర్మం
ముడతలికి అవకాసం ఎక్కువ కనుక ,నూనె మసాజ్ వారానికి ఒకసారన్నా అవసరం .
8 గుడ్డులోని తెల్ల సోన లో కాస్త పసుపు ,ముల్తాని మిట్టి కలిపి ,రాస్తే ముడతలు తగ్గుతాయి .
తెల్లసొన ఎలాంటి వాసనా వుండదు , కనుక నిరభ్యంతరంగా వాడచ్చు . ఇదే తెల్లసొన
కండిషనింగ్ కొసమ్ జుట్టుకి వాడితే , కడగడానికి చల్లని నీరుమత్రమే వాడాలి .
9 మోచేతులు నల్లగా ఉన్నాయా ఐతే వాడేసిన నిమ్మచేక్కలో కొంచెం సాల్ట్ వేసి రుద్దితే
నలుపు విరిగి పోతుంది . మేడలో గొలుసువల్ల వచ్చిన నలుపు కూడా పోతుంది .
10 ముఖ్యమైన విషయం ఏమిటంటే , చెప్పాను కదా అని అన్ని కలిపి చెయ్యవద్దు . మీకు ఏది
అందుబాటులో వుందో తరచూ అంటే వారానికి కనీసం మూడు సార్లన్న చెయ్యగలి గినది
ఎంచుకుని అది మాత్రం చెయ్యండి .
11 చెప్పినవన్నీ మొహం తో పాటు మెడకు కూడా చేసే అలవాటు చేసుకోండి . అప్పుడే బావుంటుంది .
వీటిలో ఏ విధమైన హానికర పదార్ధాలు లేవు అన్ని వంటింటి లోని ఉపయోగించే పదార్దాలే
కనుక ఎటువంటి హాని జరగదు .
12 జలుబు వున్నప్పుడు విక్స్ కాని బామ్ కాని ,వేడినీళ్ళలో వేసి ఆవిరి పట్టండి . అదే బాగా
'' గొంతు నొప్పిగా ఉందనుకోండి గ్లాస్ నీళ్ళలో స్పూన్ జీలకర్ర చిటికెడు పసుపు ఉప్పు వేసి
మరిగించి ,వడపోసి తాగి చూడండి'' ,ఎంత త్వరగా ఉపసమనం వుంటుందో .
13 రాత్రిపూట మజ్జిగ మానేస్తే పొట్ట రాదట , పెరుగుకన్నా ,చిలికిన మజ్జిగ మంచిదట .
14 పడుకునే ముందు పాలలో పటిక బెల్లం పొడి వేసుకుని తాగితే నిద్ర బాగా పడుతుంది .
16 ఎలర్జీ వల్లబాధపడే వాళ్ళు, తుమ్ముల తో ఆస్తమా తో ఇబ్బంది పడేవాళ్ళు రోజూ తాగే
'' నీళ్ళు వేడిచేసుకుని తాగడం అలవాటుచేసుకోవాలి '', ప్రతిరోజూ గోరువెచ్చగా నీరు త్రాగడం
వల్ల ఎన్నో వుపయగాలు వున్నాయి ,పొట్టకు మంచిది , మొహానికి ముడతలుకుడా రావట .
17 ప్రొద్దున్నే చెక్క నిమ్మ రసంలో స్పూన్ తేనే కలిపి తాగితే , వళ్ళు తగ్గుతుంది తెల్సుగా
అలాగే కళ్ళలో వయసు వల్ల మెరుపు తగ్గడం వుండదు . తుమ్ములు అలర్జీ కూడా
తగ్గుతుంది . తగ్గలేదంటే ,పడలేదేమో చూసి తేనే మానే సేయ్యండి .
18 గ్ర్రెన్ టీ తాగడం వల్ల షుగర్ వచ్చే అవకాశాలు ,మోహంలో ముడతలు వచ్చే అవకాశాలు
తగ్గడం తో పాటు ,పోట్టకుడా తగ్గుతుంది . వాడేసిన టీ బాగ్స్ కళ్ళమీద పెట్టుకుంటే
రిలాక్సేషన్ తో బాటు , దిగులుగా వుండే కళ్ళకు మెరుపు వస్తుంది .
19 ఏ మచ్చలు లేని మంచి రంగు , చర్మం ఉన్నాయా , ఐతే మీరు నెలకి ఒకసారన్నా ఈ ప్యాక్
వేసుకోవాలి ఇక మీదట కూడా ఏ ఇబ్బందులు రాకుండా ,సెనగ పిండి [బేసన్ ] లో ఒక చెక్క
నిమ్మరసం , ఒకపెద్దస్పూను పెరుగు ,చిటికెడు పసుపు ,వేసి కలిపి ,మొహానికి మెడకి ,
అవసరం అనుకుంటే చేతులకి వేసుకుని , ఆరాక కడిగెయ్యాలి . ఇద మచ్చలు , ముడతలు ,
రాకుండా చర్మం నునుపుగా ఉండటానికి పనికొస్తుంది .
****************************
తెలియనే తెలియరు . మరికొంతమంది చిన్నవయసు లోనే ముదురుల్లా అన్పిస్తారు . మనజీన్స్ ఎలాంటివైనా
కొన్ని జాగ్రత్తలతో , అందాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు . మన ఆడవాళ్లకు జుట్టు అంటే ఎంత ప్రేమో ,
1 పెరుగులో మెంతి పిండి వేసి రాత్రంతా వుంచి తలకు పెట్టేది .
ఇది జుట్టు మెత్తగా అవడానికి పనికి వస్తుంది .
2 గోరింటాకు తలకు పెట్టె వాళ్ళు ,టీ డికాషన్ లో కలపకూడదు .
పెరుగులో మాత్రం కలపాలి . రాత్రి కలిపి వుంచి పొద్దున తలకు
పెట్టుకుని నీళ్ళతో మాత్రమే కడగాలి .'' తర్వాత రోజు ,కొబ్బరి నూనె
రాసి ఒకగంట ఆగి షాంపూ చెయ్యాలి'' . తలలో చుండ్రు ఉన్నట్లయితే
బీట్ రూట్ రసం తో గోరింటాకు కలిపితే ,చుండ్రు వదిలి పోతుంది . రంగు
వద్దు కేవలం మెత్తదనం కోసం అనుకుంటే ,కొబ్బరి నూనె రాసి ,గోరింట
ఆకు పెట్టుకోవాలి .
3 కలిపే విధానం తెలుసు గా ,ఒక కప్ గోరింట పొడి ,గుంటగల గరాకు పొడి ఒకస్పూన్ ,ఉసిరి పొడి
సగం స్పూన్ , నాలుగు చుక్కల యూక్ లిప్ట స్ ఆయిల్ , నాలుగు చుక్కల నిమ్మరసం ,నీళ్ళతో
కలిపి రెండు స్పూన్ల పెరుగు వెయ్యాలి , లేదా పైన చెప్పినట్లు బీట్ రూట్ రసం తో మొత్తం
కలుపుకోవచ్చు .వాసన నచ్చకపోతే జుట్టు కడిగేటప్పుడు నిమ్మచేక్క పిండి న నీళ్లు పోసుకోవాలి .
4 మొహానికి , తురిమిన ఆలుగడ్డ [బంగాళదుంప] లో నిమ్మరసం వేసి మొహమంతా మృదువు గా
రాయాలి . మిగిలిన మిశ్రమం కళ్ళ మీదవుంచి పా వుగంట తర్వాత చల్లని నీళ్ళతో కడగాలి .
మీరిక కెమికల్ బ్లీచ్ వాడే అవసరం రాదు .
మచ్చలు ముడతలతో పాటు ,చెడు అలవాట్ల వల్ల కళ్ళకింద వచ్చిన ముడతలు పోతాయి .
అన్నట్లు వట్టినిమ్మచేక్కరాసినా బ్లీచ్ అవుతుంది కాని ఎండలోకి వెళ్ళకూడదు మొహం
నల్లబడుతుంది .
5 '' టమాట మధ్యకి కట్ చేసి ,రెండుచేతుల పట్టుకుని చెంపల మీద పైకి తిప్పుతూ మొహం
అంతా రాయాలి ,20 నిముషాలు ఆగి కడిగేస్తే ఎండవల్ల వచ్చిన ''టాన్ '' పోతుంది . స్కిన్
లో కూడా చాల మార్పు గమనించవచ్చు వారానికి రెండుసార్లు చేస్తే చాలు ''.
6 మగవాళ్ళకి ఎండలో తిరగడం వల్ల వచ్చే నల్లని మచ్చలు వలయాలు ,పోవాలంటే ,అలోవేర
[కలబంద ] గుజ్జులో నిమ్మ రసం నాలుగు చుక్కలు వేసి మచ్చలమీద రాసి ఆరాక కడిగేయాలి .
'' ఏన్ని మందులు వాడినా తగ్గని మచ్చలు ,ఇలా వారానికి నాలుగు సార్లు చేస్తే పోతాయి'' .
7 మీది పొడి చర్మమా , తేనే రాసి చుడండి , కాస్త బొంబాయి రవ్వలో తేనే నీరు వేసి ముద్దలా
చేసి మోహము మెడ రాసి కాస్తాగి కడగాలి మృదువైన చర్మం మీసొంతం .అలాగే పొడిచర్మం
ముడతలికి అవకాసం ఎక్కువ కనుక ,నూనె మసాజ్ వారానికి ఒకసారన్నా అవసరం .
8 గుడ్డులోని తెల్ల సోన లో కాస్త పసుపు ,ముల్తాని మిట్టి కలిపి ,రాస్తే ముడతలు తగ్గుతాయి .
తెల్లసొన ఎలాంటి వాసనా వుండదు , కనుక నిరభ్యంతరంగా వాడచ్చు . ఇదే తెల్లసొన
కండిషనింగ్ కొసమ్ జుట్టుకి వాడితే , కడగడానికి చల్లని నీరుమత్రమే వాడాలి .
9 మోచేతులు నల్లగా ఉన్నాయా ఐతే వాడేసిన నిమ్మచేక్కలో కొంచెం సాల్ట్ వేసి రుద్దితే
నలుపు విరిగి పోతుంది . మేడలో గొలుసువల్ల వచ్చిన నలుపు కూడా పోతుంది .
10 ముఖ్యమైన విషయం ఏమిటంటే , చెప్పాను కదా అని అన్ని కలిపి చెయ్యవద్దు . మీకు ఏది
అందుబాటులో వుందో తరచూ అంటే వారానికి కనీసం మూడు సార్లన్న చెయ్యగలి గినది
ఎంచుకుని అది మాత్రం చెయ్యండి .
11 చెప్పినవన్నీ మొహం తో పాటు మెడకు కూడా చేసే అలవాటు చేసుకోండి . అప్పుడే బావుంటుంది .
వీటిలో ఏ విధమైన హానికర పదార్ధాలు లేవు అన్ని వంటింటి లోని ఉపయోగించే పదార్దాలే
కనుక ఎటువంటి హాని జరగదు .
12 జలుబు వున్నప్పుడు విక్స్ కాని బామ్ కాని ,వేడినీళ్ళలో వేసి ఆవిరి పట్టండి . అదే బాగా
'' గొంతు నొప్పిగా ఉందనుకోండి గ్లాస్ నీళ్ళలో స్పూన్ జీలకర్ర చిటికెడు పసుపు ఉప్పు వేసి
మరిగించి ,వడపోసి తాగి చూడండి'' ,ఎంత త్వరగా ఉపసమనం వుంటుందో .
13 రాత్రిపూట మజ్జిగ మానేస్తే పొట్ట రాదట , పెరుగుకన్నా ,చిలికిన మజ్జిగ మంచిదట .
14 పడుకునే ముందు పాలలో పటిక బెల్లం పొడి వేసుకుని తాగితే నిద్ర బాగా పడుతుంది .
16 ఎలర్జీ వల్లబాధపడే వాళ్ళు, తుమ్ముల తో ఆస్తమా తో ఇబ్బంది పడేవాళ్ళు రోజూ తాగే
'' నీళ్ళు వేడిచేసుకుని తాగడం అలవాటుచేసుకోవాలి '', ప్రతిరోజూ గోరువెచ్చగా నీరు త్రాగడం
వల్ల ఎన్నో వుపయగాలు వున్నాయి ,పొట్టకు మంచిది , మొహానికి ముడతలుకుడా రావట .
17 ప్రొద్దున్నే చెక్క నిమ్మ రసంలో స్పూన్ తేనే కలిపి తాగితే , వళ్ళు తగ్గుతుంది తెల్సుగా
అలాగే కళ్ళలో వయసు వల్ల మెరుపు తగ్గడం వుండదు . తుమ్ములు అలర్జీ కూడా
తగ్గుతుంది . తగ్గలేదంటే ,పడలేదేమో చూసి తేనే మానే సేయ్యండి .
18 గ్ర్రెన్ టీ తాగడం వల్ల షుగర్ వచ్చే అవకాశాలు ,మోహంలో ముడతలు వచ్చే అవకాశాలు
తగ్గడం తో పాటు ,పోట్టకుడా తగ్గుతుంది . వాడేసిన టీ బాగ్స్ కళ్ళమీద పెట్టుకుంటే
రిలాక్సేషన్ తో బాటు , దిగులుగా వుండే కళ్ళకు మెరుపు వస్తుంది .
19 ఏ మచ్చలు లేని మంచి రంగు , చర్మం ఉన్నాయా , ఐతే మీరు నెలకి ఒకసారన్నా ఈ ప్యాక్
వేసుకోవాలి ఇక మీదట కూడా ఏ ఇబ్బందులు రాకుండా ,సెనగ పిండి [బేసన్ ] లో ఒక చెక్క
నిమ్మరసం , ఒకపెద్దస్పూను పెరుగు ,చిటికెడు పసుపు ,వేసి కలిపి ,మొహానికి మెడకి ,
అవసరం అనుకుంటే చేతులకి వేసుకుని , ఆరాక కడిగెయ్యాలి . ఇద మచ్చలు , ముడతలు ,
రాకుండా చర్మం నునుపుగా ఉండటానికి పనికొస్తుంది .
****************************
Good chitkaas... shared in my FB Timeline... Best wishes to you on the occasion of this Manmatha nama samvatsara Telugu Ugadi!
ReplyDeletenamaste ,meeekukuda manmadha nama samvatsara ugadi subhakankshalu.
ReplyDelete